Sunday, January 15, 2012

దోమకాటుకు..


దోమకాటుకు..

మనిషి బతుకు మొదటినుంచీ, సదుపదాయాలువెదకడం, సమస్యలకు సమధానాలు వెదకడంతోనే సాగుతున్నది. ఎయిడ్స్ వ్యాధికి చికిత్స గురించి గడిచిన 30 సంవత్సరాలుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇవి కుదిరేపని కాదు, అన్నారు ఇంచుమించు అందరూ! అంత నిరాశ అవసరం లేదు అనడానికి 2011లో సూచనలు అందాయి.
కొన్ని సమస్యలకు సమాధానాలు ‘యురేకా!’ పద్ధతిలో ఒక్క ఆలోచనతో అందవు! ఈ ప్రపంచంలో సమస్యలకు అంతం లేదు. అందుకే పరిశోధనలకూ అంతం లేదు. ఆ పరిశోధనలు పెద్దపెద్ద విశ్వవిద్యాలయాలు, సంస్థలోనే జరగనవసరం లేదు. పట్టుదలతో ముందుకు సాగితే గట్టి సమస్యలకు కూడా సమాధానాలు అందుతాయి. అందుకు ఉదాహరణ దోమల సమస్య! దానికి సమాధానాలు.

సమస్య: దోమలు సమాధానం: రసాయనం స్ప్రే!

1940 నుంచి మొదలు రసాయనాలు సాయంతో దోమలను దూరం తోలే పద్ధతులు వాడుకలో ఉన్నాయి. ఈ రసాయనాలు ఎంతమందికి అందుబాటులో ఉంటాయి? ఉన్నవాళ్ళు ఎన్నిసార్లని వాడతారు? అందుకే కాలిఫోర్నియా యూనివర్సిటీలో పరిశోధకులు ఆనంద శంకర్ రేగారు ఒకకొత్త రసాయనాన్ని తయారుచేశారు. ఇది దోమలకు వాసనలు తెలియకుండా చేస్తుంది. ఇక మనుషులు వాటికి అందరు!

దోమలు కార్బన్‌డై ఆక్సైడ్ వాసన ఆధారంగా, జీవులను చేరుకుంటాయి. అక్కడ వాటికిగాను ఆహారం సిద్ధంగా ఉందని ఈ సీఓటూ ఒక సిగ్నల్‌గా పనిచేస్తుంది. ఈ వాసనను పట్టడానికి దోమలకు ఉండే శక్తిని, కొన్ని రసాయనాలు ఆపగలవు. రే ఈ రకం రసాయనాలను యాభయ్యింటిని పోగుచేసి పరిశోధించారు. ఈ ప్రయత్నంలో దోమలను పట్టుకుని వాటికి నేరుగా రసాయనాలు ఇంజెక్షన్‌గా ఇచ్చే వరకు వెళ్లారు. ప్రయోగాల కారణంగా 2-బ్యుటనోన్ అనే రసాయనం సీఓటూకు ఇమిటేటర్‌గా పనిచేస్తుందని తెలిసింది. మరో బ్యునాల్ కూడా మంచి ప్రభావం చూపించింది. ఇక మరో రసాయనం 2, 3 బ్యుటేన్ డయోన్, దోమల వాసన శక్తిని పూర్తిగా గజిబిజి చేస్తుందని తెలిసింది.

ఇక్కడ విచిత్రం ఏమిటంటే, ఈ రసాయనాలును మనం రాసుకోనవసరం లేదు. రాత్రి మొత్తం వాటి మధ్యన ఉండనవసరం కూడాలేదు. మనుషులు ఉండే చోట్ల ఈ రసాయనాలను పక్కన ఉంచితే, దోమలు, మనుషుల బదులు అక్కడికి ముందు పోతాయి. ఆ తర్వాత రసాయనం ప్రభావంతో వాటికిక వాసనలు తెలియకుండా పోతాయి.
ఈ రసాయనాల వాసనలు, మనుషులుండే ప్రాంతాలలో, ఆ చుట్టుప్రక్కల దుప్పటిగా పరచుకుని, దోమలను ఆపేస్తాయి. కానీ, ఈ రసాయనాలు మనం కూడా వాడే పరిస్థితి రావడానికి మరి కొన్ని సంవత్సరాలు పడుతుంది, అంటున్నారు.

‘‘దోమలు ఏటా 70 కోట్లమందిని రోగాలకు గురిచేస్తున్నాయి. ఒక్క మలేరియాతోనే సంవత్సరానికి 8 లక్షలమంది మరణిస్తున్నారు’’.

No comments:

Post a Comment