Thursday, December 29, 2011

నా కవిత - ఏముంది


ఏముంది

పదిమంది రాసింది చదివినందుకు నేనున్నాను
పదిమంది పాట విన్నందుకు నేను మిగిలాను
అందరి ఆలోచనలు తలలో ఆడుతున్నందుకు
నేనింకా కదులుతున్నాను
కలం కన్నీళ్లతో కాగితాన్ని తడిపింది
గతంలోని బరువును ఊపిరి తుడిపింది
మెరుపు విరిగి
ముక్కలు తల నిండా పరుచుకున్నాయి
చిత్తడి నేలలోంచి
అక్షరాలు మొలకెత్తుతున్నాయి
వాన వెలిస్తే బాగుండును
పొగచూరిన ఆలోచనల వాసనలోనుంచి
సారాంశం వాక్యాలను వెతకగలిగే వాడిని
సంతకాలకు రంగులున్నాయా
ఎందుకట్లా మొరటు గొంతులు
కనుపాపల మీద నాట్యమాడుతున్నాయి
గీతలు కరగక ముందే
ఆకారాలను కలగలిపి
రేపటి కొరకు వంతెన కొనసాగించాలి
కనీసం మాటలకు
వైశాల్యం పెరుగుతుంది
లేకుంటే అంతా అయోమయం
చెప్పేందుకు నేనుండాలె గదా

2 comments: